టీచర్​ దెబ్బలకు ఆరేళ్ల బాలుడి మృతి..!

కలం, వెబ్​ డెస్క్​ : విద్యార్థులు తప్పు చేస్తే సున్నితంగా దండించాల్సిన టీచర్​ ఓ ఆరేళ్ల బాలుడు ప్రాణాలు పోయేలా కొట్టాడు. విఖాపట్నం (Visakhapatnam) లోని లిటిల్​ గార్డెన్​ స్కూల్​ లో ఈ దారుణం జరిగింది. హోం వర్క్​ చేయలేదని టీచర్​ బెదిరించి.. మందలించడంతో ప్రణయ్​ రాజ్​ (6) భయాందోళనకు గురయ్యాడు. గుక్కపెట్టి ఏడుస్తూ బాలుడు క్లాస్​ రూమ్​ లోనే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రణయ్​ రాజ్​ తల్లిదండ్రులు స్కూల్​ ఎదుట ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ టీచర్​ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>