వరంగల్ సీపీ కీలక నిర్ణయం.. ఇన్‌స్పెక్టర్లు బదిలీ

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) సన్ ప్రీత్ సింగ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని శాయంపేట సీఐగా బదిలీ చేయగా, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ జె. శ్యామ్ సుందర్ కాజీపేటకు బదిలీ అయ్యారు. పీసీఆర్‌లో పనిచేస్తున్న ఏ. మహేందర్‌ను హసన్‌పర్తికి, ప్రస్తుతం హసన్‌ పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి. చేరాలును వీఆర్‌‌గా ఉంచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>