ప్రజా సమస్యలకు వేదిక.. వలిగొండలో ప్రజావాణి

కలం, వలిగొండ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో (Valigonda MPDO) జలంధర్ రెడ్డి కోరారు. సోమవారం నుంచి మండలంలో తొలిసారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, సమస్యల పరిష్కారంలో పారదర్శకత మరియు వేగం పెంచడం లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>