తూప్రాన్‌లో కల్లు దుకాణాలపై ఈగల్ టీమ్ నజర్

కలం, మెదక్ బ్యూరో :  మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) పట్టణంలోని కల్లు దుకాణాలపై రాష్ట్ర ఈగల్ టీమ్ ఫోర్స్ (Eagle Team Force) అకస్మాత్తుగా దాడులు నిర్వహించింది. మత్తు పదార్థాలతో కల్లు కల్తీ జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో అధికారులు ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీమ్ డీఎస్పీ పుష్పక్ కుమార్ నేతృత్వంలో మొత్తం ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు, ఏకకాలంలో ముకుమ్మడిగా తూప్రాన్ పట్టణంలోని 5 కల్లు దుకాణాలపై మెరుపు దాడులు చేశారు.

ఈ సోదాల్లో భాగంగా కల్లులో కలిపేందుకు పలు మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అనుమానం రావడంతో, శాంపిళ్ల కోసం పెద్ద ఎత్తున కల్లు సీసాలను అధికారులు స్వాధీనం చేసుకుని (సీజ్ చేసి) ల్యాబ్‌కు తరలించారు. ఆ కల్లు సీసాలలో  నిషేధిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సేల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత మత్తు పదార్థాలను కల్లులో కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>