కలం, వెబ్ డెస్క్: ధరణి పోర్టల్ (Dharani Portal)లో చోటు చేసుకున్న అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వెలుగు చూసిన వేలాది భూముల అవకతవకలపై సీరియస్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని భావించింది. ఈ మేరకు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి, సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెలువరించింది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీలపై సిట్ దర్యాప్తు చేయనుంది.

