కలం, వెబ్ డెస్క్ : కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Dam) వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద ఉధృతి పెరగడంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామంతో అధికారులు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత సీజన్లో జలవిద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కొరత తీరి, సరఫరా వ్యవస్థకు గణనీయమైన ఊరట లభించనుంది.

