కలం, వెబ్ డెస్క్: స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV) మరోసారి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులతో రెచ్చిపోయారు. అంతర్జాతీయ రాజకీయాలపై వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అమెరికా (America), ఇజ్రాయెల్ (Israel), ఇరాన్(Iran) మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆర్జీవీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరాటం అనేది యేసు, అల్లాహ్ మధ్య పోరాటం లాంటిదేనని, ఎవరు గెలుస్తారో, వారి మతంలోకి తాను మారిపోతానంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు దీనిని వ్యంగ్యంగా తీసుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు వర్మ అటెన్షన్ కోసమే ఇలాంటి పోస్టులు పెడతాడంటూ లైట్ తీసుకుంటున్నారు.
ఈ యుద్ధంపై వర్మ మరో పోస్ట్ కూడా చేశారు. ట్రంప్ను ఉద్దేశిస్తూ బలం ఉన్నవాడు ఏది చేసినా సరైందేనని వర్మ చెప్పాడు. దీనికి ఓ హిందీ సినిమా డైలాగ్ను ఉదాహరణగా పేర్కొన్నారు. “జిస్కే పాస్ పవర్ హై, ఉస్కా రాంగ్ భీ రైట్ హోజాతా హై” అని పేర్కొంటూ, ట్రంప్ సరైనవాడే, ఎందుకంటే ఆయన దగ్గర పవర్ ఉందని అభిప్రాయపడ్డారు.

