బాంబులా పేలిన కొత్త ఫ్రిడ్జ్.. నలుగురు స్పాట్ డెడ్

కలం, వెబ్ డెస్క్: ఎంతో సంబురంగా కొనుక్కున్న కొత్త ఫ్రిడ్జ్ ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. ఫ్రిడ్జ్ బాంబులా పేలిపోవడంతో (Refrigerator Blast) నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బెళగావిలోని చమౌలి గల్లీలో శారద డమోలి, రాజారం కుటుంబం సోమవారం కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి, ఇంటికి తీసుకొచ్చారు.

రాత్రి అంతా నిద్రపోయాక ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఈ ఘటనలో శారదతో పాటు ఆమె కుమార్తెలు ప్రియా, గంగ, మరో మహిళ సజీవ దహనం అయ్యారు. రాజారం, రోషన్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>