కలం, వెబ్ డెస్క్: మూసారాంబాగ్ (Moosarambagh) ప్రజల చిరకాల స్వప్నం నేడు నెరవేరనుంది. అంబర్పేట్ నుంచి మలక్ పేట్ టీవీ టవర్ వైపు రాకపోకలను సులభతరం చేసేందుకు రూ.52 కోట్ల వ్యయంతో సుమారు 400 మీటర్ల పొడవున నిర్మించిన మూసారాంబాగ్ కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమయ్యే స్థానికులకు, వాహనదారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం లభించనుంది.

