epaper
Monday, March 2, 2026
epaper

హెరిటేజ్ తో MOU చేసుకున్న ఎంజీయూ

కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ హెరిటేజ్ తో మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) శుక్రవారం అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై తెలంగాణ హెరిటేజ్ విభాగం తరఫున డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) తరఫున రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలువాల రవి సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా హిస్టరీ అండ్ టూరిజం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం అంటున్నారు అధికారులు. హెరిటేజ్ పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు, సెమినార్లు, టూరిస్ట్ గైడ్ ట్రైనింగ్ లు మరింత బలోపేతం అవుతాయని డైరెక్టర్ అర్జున్ రావు కుతాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ డా.పి.నాగరాజు, ఏడీ మల్లు నాయక్, సూపరింటెండెంట్ రాజు, అధ్యాపకులు డా. పనస రామకృష్ణ, డా. మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!