కలం, కల్వకుర్తి: కల్వకుర్తి (Kalwakurthy) ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించబడుతుందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్లో వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల ప్రజలు, బిడ్డర్లు నిర్ణీత సమయంలో కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ లో నిర్వహించే వాహనాల వేలంలో పాల్గొనవచ్చని సీఐ పేర్కొన్నారు.

