epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇంటర్​ విద్యార్థులకు సూపర్​ ఆఫర్​.. రూ.లక్ష జీతంతో నేవీలో ఉద్యోగాలు

కలం, వెబ్​డెస్క్​: ఇంటర్​, తత్సమాన(10+2) విద్యార్థులకు సూపర్​ ఆఫర్​. భారత నేవీ (Indian Navy) లో రూ.లక్షకు పైనే జీతంతో ఉద్యోగంలో స్థిరపడే అవకాశం. ఈ మేరకు ఇండియన్​ నేవీ 10+2 బీటెక్​ కేడెట్​ ఎంట్రీ  స్కీమ్ (పర్మనెంట్​ కమిషన్​)​​ నోటిఫికేషన్​ విడుదలైంది. ఇందులో ఎంపికైనవాళ్లు ఎలిమల(కేరళ)లోని ఇండియన్​ నేవీ అకాడమీలో ఉచితంగా  నాలుగేళ్ల బీటెక్​ కోర్సును పూర్తిచేయడంతోపాటు పర్మనెంట్​ ఆఫీసర్​గా కొలువు పొందవచ్చు. ఎంపికైతే నెలకు కనీసం రూ.లక్షతో జీతం మొదలవుతుంది.

వివరాలు:

కోర్స్​: 10+2 (బీటెక్​) క్యాడెట్​ఎంట్రీ స్కీమ్​(పర్మనెంట్​ కమిషన్​)

బ్రాంచ్​: ఎగ్జిక్యూటివ్​ అండ్​ టెక్నికల్​

ఖాళీలు: 44(ఇందులో 7 కచ్చితంగా మహిళలకు కేటాయిస్తారు)

అర్హతలు:

అభ్యర్థులు 02 జనవరి 2007 – 01 జులై 2009 మధ్య జన్మించి, అవివాహితులై ఉండాలి. ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్స్​ సబ్జెక్టులతో ఇంటర్​ లేదా తత్సమాన విద్యలో 70శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా ఇంటర్​/తత్సమాన విద్యలో ఇంగ్లీష్​లో 50శాతం మార్కులు వచ్చి తప్పనిసరి. బీఈ/బీటెక్​లో ప్రవేశం కోసం జేఈఈ(మెయిన్​) ఎగ్జామ్​ రాసి ఉండాలి. దీని ఆధారంగా నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) కామన్​ ర్యాంక్ లిస్ట్​ –2025 ప్రకారం సర్వీస్​ సెలక్షన్​ బోర్డ్​(ఎస్​ఎస్​బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు.  అనంతరం శారీరక దృఢత్వ పరీక్షలు, ఆరోగ్యం పరీక్షలు​ నిర్వహిస్తారు. నిర్దేశిత ఎత్తు, బరువు ఉండాలి. అన్నింటిలో ప్రమాణాలు అందుకున్నవాళ్లు ఎలిమలలో బీటెక్​ శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం నేవీలో ఉద్యోగిగా  నియమిస్తారు. ప్రారంభ జీతం రూ.లక్షకు పైనే ఉంటుంది.

దరఖాస్తు: నేవీ వెబ్​సైట్  www.joinindiannavy.gov.in ​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆఖరు తేదీ: జనవరి 19, 2026.

నోట్​: పూర్తి వివరాలకు నేవీ వెబ్​సైట్​ లోని నోటిఫికేషన్​లో ఉన్న వివరాలను జాగ్రత్తగా చదవగలరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>