epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

షాపులో నిద్రపోతుంటే.. షట్టర్లు మూసి తగలబెట్టారు

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో (Bangladesh) హిందువులపై దాడులు ఆగడం లేదు. గతేడాది భారత వ్యతిరేక అల్లర్లతో మొదలైన దాడులు, హత్యాకాండ కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది దీపూ చంద్ర దాస్​ను చెట్టుకు కట్టి సజీవ దహనం (Burned Alive) చేసిన విధంగానే ఆదివారం మరో హిందూ యువకుడిని పెట్రోల్​ పోసి తగలబెట్టారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమిల్లా జిల్లా లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన చంచల్​ చంద్ర భౌమిక్ (Chanchal Chandra)​ (23) కొన్నేళ్లుగా నార్సింగ్డిలోని మసీద్​ మార్కెట్​లో ఉన్న ఓ గ్యారేజ్​లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి గ్యారేజీలో నిద్రపోతుండగా, కొందరు దుండగులు దుకాణం షట్టర్లకు తాళం వేసి, అనంతరం పెట్రోల్​ పోసి అంటించారు.

షాపు తగలబడుతుండడం చూసి స్థానికులు ఫైర్​ సర్వీస్​కు కాల్​ చేశారు.​ అగ్నిమాపక దళం వచ్చేసరికి సుమారు గంటపైనే పట్టింది. ఈలోపే దుకాణం తగలబడింది. ఫైర్​ సర్వీస్​ సిబ్బంది మంటలార్పి, చంచల్ (Chanchal Chandra)​ మృతదేహాన్ని బయటకు తీశారు. మంటల్లో చిక్కుకున్న చంచల్ మృతదేహం  గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది.​ గ్యారేజీ తగలబడుతుండగా, ప్రాణభయంతో చంచల్​ కేకలు పెట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పక్కాగా ప్లాన్​ చేసి చంచల్​ను హత్య చేశారని, బాధిత కుటుంబం ఆరోపించింది. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది. కాగా, షాపు మంటల్లో చిక్కుకొని తగలబడుతున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.

చంచల్​ హత్య బంగ్లాదేశ్​లో మైనారీటీలు.. ముఖ్యంగా హిందువుల భద్రతపై మరోసారి చర్చ లేవనెత్తింది. దాడులు, హత్యలు జరుగుతున్నా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్​ యూనస్​ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో మరిన్ని దాడులు జరగొచ్చనే ఆందోళనలు హిందువుల్లో వ్యక్తమవుతున్నాయి.

Read Also: మీ ఆటలు సాగవు.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>