కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ (AP Budget) ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు అధికారులు విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు చేశారు. అనంతరం అసెబ్లీకి బయలుదేరారు.


