కలం, వెబ్డెస్క్: లోక్సభ ప్రాంగణంలో ఒక ఎంపీ స్మోకింగ్ (TMC MP Smokes) చేశారనే విషయం గురువారం స్పీకర్ దృష్టికి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు స్మోకింగ్ చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఆ ఎంపీ కొన్ని రోజులుగా లోక్సభ ప్రాంగణంలో ఇ–సిగరెట్లను తాగుతున్నట్లు తాను గమనించానని స్పీకర్ స్పీకర్ ఓం బిర్లాకు (OM Birla) ఫిర్యాదు చేశారు. ఆ ఎంపీ పేరును ఠాకూర్ ప్రస్తావించలేదు. ఈ సంఘటనపై విచారణ జరిపించి, సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఠాకూర్ కోరారు. ‘దేశంలో ఇ–సిగరెట్లపై నిషేధం ఉంది. ఈ విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలి. లోక్సభ ప్రాంగణంలో టీఎంసీ ఎంపీ ఒకరు కొన్ని రోజులుగా ఇ–సిగరెట్ స్మోకింగ్ (TMC MP Smokes) చేస్తున్నారు. అతనికి ప్రత్యేక అనుమతి ఉందేమో తెలియదు.’ అని ఠాకూర్ అన్నారు. మరోవైపు శీతాకాల సమావేశాల్లో ఎన్నికల సంస్కరణలపై జరగుతున్న చర్చ గురువారం సైతం వాడీవేడిగా కొనసాగింది.
Read Also: లోడ్తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ
Follow Us On: X(Twitter)


