కలం, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో అటెండెన్స్ ను ఇక నుంచి డిజిటల్ (Digital Attendance) రూపంలో నమోదు చేయాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆదేశాలు జారీ చేశారు. రిజిష్టర్ లో సంతకం పెట్టడమే కాకుండా అసెంబ్లీలో కూర్చునే విధంగా సభాపతి కఠిన ఆంక్షలు ప్రవేశపెట్టాడు. ఇక నుంచి డిజిటల్ రూపంలో హాజరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రేపటి (బుధవారం) నుంచి అమలు కానుంది. అయితే, వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం (Digital Attendance) చర్చనీయాంశంగా మారింది. జగన్ టార్గెట్ గానే డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
Read Also: అసెంబ్లీకి జగన్.. వాటిపై ప్రశ్నిస్తారా.. సైలెంట్ అవుతారా..?
Follow Us On: Youtube


