కలం, వెబ్డెస్క్: ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. గతేడాది నుంచి టారిఫ్లతో వివిధ దేశాలపై విరుచుకుపడ్డారు. నిరుడు ఏప్రిల్ నుంచి భారత్పైనా టారిఫ్స్తో రెచ్చిపోయారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా సుంకాల విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. భారత్పై విధించిన 25శాతం టారిఫ్స్ను 18శాతానికి తగ్గించారు (US tariff cuts). దీనికి అనేక కారణాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
- ఇతర దేశాలపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ఈ ఏడాది మార్చిలో తుది తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు టారిఫ్లకు వ్యతిరేకంగా వస్తే తన ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి ముందుగానే ట్రంప్ ఇలా ప్రిపేర్ అయినట్లు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే టారిఫ్స్ను కాస్త తగ్గించి.. వాటిని చట్టబద్ధం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు చూస్తున్నారు.
- ఇండియా నుంచి వచ్చే వస్తువులపై.. ముఖ్యంగా స్పేర్ పార్ట్స్ వంటి వాటిపై భారీగా టారిఫ్లు అమలవడంతో తమకు కష్టంగా మారిందని, దేశ ద్రవ్యోల్బణం పడిపోతుందని అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలు ట్రంప్పై ఇన్నాళ్లూ ఒత్తిడి తెచ్చాయి. దీని ఫలితమే ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
- ఇక అన్నింటికంటే ముఖ్యం.. తాను చెప్పినట్లుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా భారీగా తగ్గించిందని ట్రంప్ అంచనాకు రావడం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగించడానికి కారణాల్లో మాస్కో నుంచి ఇండియా ఆయిల్ కొనడం ఒకటని అంతకుముందు అనేక వేదికలపై పదే పదే ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం లేదని అగ్రరాజ్యం అధ్యక్షుడు అనుకుంటున్నారని, టారిఫ్స్ తగ్గించడానికి (US tariff cuts) ఇదీ ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశామని భారత్ అధికారికంగా ప్రకటించలేదు.


