కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండల పరిధిలోని వంకేశ్వరం (Vankeswaram) గ్రామ శివారులో ఎస్సీ వసతి గృహం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. ఘటనపై ‘కలం డైలీ’ లో ‘వంకేశ్వరంలో పైప్ లైన్ ధ్వంసం’ అనే శీర్షికన బుధవారం వార్త పబ్లీష్ అయింది. దీంతో స్పందించిన అధికారులు పైప్ లైన్ లీకేజీకి సంబంధించి మరమ్మతులను వెంటనే చేపట్టారు. ఈ సందర్భంగా కలం వెబ్ మీడియాకు గ్రామ ప్రజలు, యువజన సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.

