గోల్కొండ పరిధిలో రహస్య సొరంగం.. అక్రమ తవ్వకాల కలకలం!

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలోని చారిత్రాత్మక కుతుబ్ షాహీ సమాధుల (Qutub Shahi tombs) కాంప్లెక్స్ సమీపంలో రహస్య సొరంగం వెలుగుచూసింది. 400 ఏళ్ల నాటి ఈ పురాతన వారసత్వ కట్టడం పరిధిలోని స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ రంగంలోకి దిగారు.

ఈ అక్రమ తవ్వకాలు, రహస్య సొరంగం వ్యవహారంపై ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులకు ఫిర్యాదు చేశారు. పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుంది? దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>