తొమ్మిది జంటలకు మళ్లీ పెళ్లి.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: పెళ్లంటే ఎవ‌రికైనా జీవితంలో ఒకేసారి జ‌రుగుతుంది అంటుంటారు. కానీ, ఆ జంట‌లు మాత్రం రెండో సారి పెళ్లి పీట‌లెక్కారు. మూడు ముళ్ల బంధంతో మ‌ళ్లీ ఏక‌మ‌య్యారు. ఈ వింత ఘ‌ట‌న కాకినాడ జిల్లా అన్న‌వ‌రం (Annavaram)లోని ర‌త్న‌గిరిపై జ‌రిగింది. గతంలో జరిగిన వివాహాల్లో దోషాలు ఉన్నాయని, ఆ కష్టాలు తీరాలంటే మళ్లీ వివాహం చేసుకోవాలని ఓ సిద్ధాంతి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దంపతులు వెల్లడించారు.

ఈ విధంగా మరోసారి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబంలో ఉన్న చికాకులు, కష్టాలు, దోషాలు తొలగిపోతాయని వారు బ‌లంగా విశ్వసిస్తున్నారు. ఈ తొమ్మిది జంటల్లో మూడు జంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందినవి కాగా, మిగిలిన ఆరు జంటలు ఆనందపురం మండలానికి చెందినవి. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌ష్టాలు పోవ‌డానికి మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం ఏమిట‌ని కొంద‌రు కామెంట్ ప్ర‌శ్నిస్తున్నారు. ఇది మూఢ‌న‌మ్మ‌క‌మ‌ని, ఈ రోజుల్లో ఇలాంటివి న‌మ్మేవాళ్లు కూడా ఉన్నారా? అని కామెంట్ చేస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం మ‌ళ్లీ పెళ్లి చేసుకోసం భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని, వీళ్లంతా చాలా ల‌క్కీ అని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>