మణుగూరులో అనుమానాస్పదంగా 19 మేకలు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండల పరిధిలోని సమితిసింగారంలో 19 మేకలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. ​బాధితుడు రాచకొండ రాములు వివరాల ప్రకారం.. రోజువారీగా మేత కోసం బయటకు వెళ్లిన మేకలు తిరిగి వస్తుండగా, మణుగూరు ఓసీ-2 చెక్‌పోస్టు సమీపంలో ఉన్న బ్లాస్టింగ్ సెక్షన్ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాగులో నీరు తాగాయి.

ఆ కలుషిత నీరు తాగిన కొద్దిసేపటికే మేకలు మృతిచెందాయి. ​దీంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి, న్యాయం చేయాలని రైతు రాములు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>