కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలం పాపయ్యపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ల మరమ్మత్తు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై శివ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివ ఆకస్మిక మరణంతో పాపయ్యపేట గ్రామంలో, ఆయన కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
Also Read : 51 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? హకీ ప్రపంచకప్పై భారత్ గురి!
Follow Us On : WhatsApp

