కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా మత్స్య శాఖ అధికారి భాస్కర్ సస్పెండ్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనంతరం నివేదికను సమర్పించడంతో ఆయనపై వేటు వేస్తూ రాష్ట్ర మత్స్య శాఖ డైరెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

