కలం, స్పోర్ట్స్: ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ సైకత్ను బోర్డు నుంచి తొలగించారంటూ వస్తున్న వార్తలకు బీసీసీఐ (BCCI) స్పష్టత ఇచ్చింది. సైకత్ కాంట్రాక్ట్ను బోర్డు రద్దు చేయలేదని ఆగస్టు 4న తెలిపింది. ఆయన ఒప్పందం గడువు సహజంగానే పూర్తయిందని చెప్పింది. 2024 మార్చిలో సైకత్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్కు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ అంపైర్ ఆయనే. దీనివల్ల అంతర్జాతీయంగా ఆయనకు మ్యాచ్ బాధ్యతలు బాగా పెరిగాయి. బోర్డుతో ఆయనకున్న పాత ఒప్పందం 2025 డిసెంబర్తో ముగిసింది. ఆ తర్వాత కాంట్రాక్ట్ను 2026 ఏప్రిల్ వరకు పొడిగించారు. 2026 ఏప్రిల్తో ఈ పొడిగించిన గడువు ముగిసింది.
ఐసీసీ మ్యాచ్లతో ఆయన బిజీగా మారడం వల్ల కాంట్రాక్ట్ను మళ్లీ పొడిగించలేదు. కాంట్రాక్ట్ ముగిసినా ఆయన సేవలను వాడుకుంటామని బోర్డు చెప్పింది. అందులో భాగంగానే 2026 జూన్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్కు ఆయనను అంపైర్గా నియమించింది. ఎలైట్ ప్యానెల్ అంపైర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం సాధారణ విషయమేనని వివరించింది. భవిష్యత్తులో కూడా అందుబాటును బట్టి ఆయన సేవలను ఉపయోగించుకుంటామని పేర్కొంది.

