నిర్మల్‌లో ‘గురువందన్’.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో బుధవారం ‘గురువందన్’ (Guru Vandan) కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన విద్యా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఆంగ్ల ఉపన్యాసకులు డాక్టర్ యు. రవికుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు కడార్ల రవీంద్ర, పూర్వ ఆచార్యులు పట్వారి శ్రీనివాస్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు గోనెల శశిరాజ్ మాట్లాడారు. భారతీయ సమాజంలో ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు దేశ నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, సమాజ అభ్యున్నతిలో గురువుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు రాజేశ్వర్, నాయకులు రమణ, నరేశ్, శ్రీకాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>