కలం, వెబ్ డెస్క్: నీట్ అంశం, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని మోదీ రాజీనామాకు పట్టుబట్టారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియానుద్దేశించి మాట్లాడారు. విద్యా వ్యవస్థ లోపాలకుగానూ కేవలం ధర్మంధ్ర ప్రధాన్ రాజీనామా చేయడం మాత్రమే సరిపోదని, విద్యార్థులకు ప్రధాని మోదీ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సీజేపీ అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. విద్యార్థులపై పెల్లెట్లు, ఏకే47లను ప్రయోగించారని గుర్తు చేశారు. విద్యార్థులను అణచివేయడంలో మోదీ తీరు ఎక్కడైనా ఒక్కటేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.

