కలం మెదక్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (ORR Accident) జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామానికి చెందిన చిన్నకటికే గౌస్, చిన్నకటికే రషీద్లు తమ మేకలను అమ్ముకోవడానికి అశోక్ లేలాండ్ వాహనంలో హైదరాబాద్లోని చంగిచర్ల మార్కెట్కు బయలుదేరారు. ఈ వాహనానికి గిర్నీ రాములు డ్రైవర్గా ఉన్నాడు. వీరి వాహనం కీసర ఓఆర్ఆర్ పరిధిలోకి చేరుకోగానే, వేగంగా వచ్చిన ఒక లారీ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గిర్నీ రాములు, చిన్నకటికే రషీద్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. చిన్నకటికే గౌస్ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

