కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ (SI Transfers) చేస్తూ జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న బి. సురేష్ ఉండవెల్లి ఎస్సైగా, ఐజ ఎస్సైగా గురుస్వామి, జోగులాంబ గద్వాల జిల్లా వీఆర్లో ఉన్న ఎ. కిరణ్ కుమార్ రాజోలి ఎస్సైగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాజోలి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న కె. గోకారిని జోగులాంబ గద్వాల వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

