కలం, హైదరాబాద్: హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినం సందర్భంగా దేశంలో ప్రజా పోరాటాలపై అమలవుతున్న ఫాసిస్ట్ (Fascism Seminar) నిర్బంధానికి, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటం కొనసాగించాలానే నేపథ్యంతో సదస్సు ఏర్పాటు చేశారు. 2026 జూలై 5 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, బుల్డోజర్ రాజకీయాలు మత, మైనారిటీల అస్తిత్వంపై దాడి, తెలుగు సాహిత్యంలో ఇటీవల ధోరణులు – మార్క్సిస్ట్ దృక్పథం అనే అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించనున్నారు.
అలాగే విరసం కళాబృందం నాటక ప్రదర్శనతో పాటు వివిధ కళాబృందాల ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా విరసం సిటీ యూనిట్ కరపత్రాన్ని, పోస్టర్లను ఆవిష్కరించారు. ‘మిత్రులందరికీ సాదర ఆహ్వానం.. ఎప్పటిలాగానే మీ స్నేహపూర్వక సహకారాన్ని ఆశిస్తూ అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం’ అని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భూపతి (తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం), విరసం సభ్యులు రాము, శివరాత్రి సుధాకర్, రాంకి, శశిధర్, నారాయణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

