Mobile Popup Ad
Mobile Popup Ad

వాట్సాప్ సీఈవో గా భారతీయుడు..

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వేదికపై మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్‌ (WhatsApp) కు క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా (Kunal Shah) సీఈవోగా ఎంపికయ్యారు. ఈ వారంలోనే భాద్యతలు చేపట్టనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఉన్న వాట్సాప్ మాతృ సంస్థ మెటా, ఈ నియామకంలో భాగంగా క్రెడ్‌లో 900 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8,550 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

ఈ పెట్టుబడితో క్రెడ్, ESOP బైబ్యాక్‌లతో ముందుకు వెళ్లనుంది. కాగా, క్రెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పదవిని సీనియర్ ఎగ్జిక్యూటివ్ మిటెన్ సంపత్ తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఆ పదవిలో ఉన్న శ్రీ షా, అత్యంత సంపన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని, భారతదేశంలోని మూడింట ఒక వంతు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కవర్ చేసే వినియోగదారుల స్థాయికి ఈ సేవ వృద్ధి చెందడాన్ని పర్యవేక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>