కలం, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకలపల్లి శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Itikalpalle Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నల్లబెల్లి మండలం లింకాలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి, ఆమె భర్త రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

