కలం, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జగిత్యాల కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గం ఆధిపత్యంతో, సొంత పార్టీలో నెలకొన్న పరిస్థితులతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


