epaper
Wednesday, March 4, 2026
epaper

చిన్న హాస్పిటల్‌లో పెద్ద ఆపరేషన్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బుర్గంపాడు (Burgampadu) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) చరిత్రలో డాక్టర్లు మొదటిసారి సీజేరియన్ చేశారు. జిల్లాలోని సారపాకకి చెందిన బానోత్ మమత రెండో కాన్పు ప్రసవం కోసం బుర్గంపాడు ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. వైద్యురాలు అనూష లక్ష్మీ శనివారం డెలీవరి చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.

గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఆసుపత్రిని 2022లో వైద్య విధాన పరిషత్ ద్వారా 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. 30 పడకలకు సరిపడా భవనం, మౌలిక సదుపాయాలు మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అన్ని వసతులు ఉండటంతో రోగుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో బుర్గంపాడు (Burgampadu) ఆస్పత్రిలో మొట్టమొదటి ఆపరేషన్ జరగడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: వారి ఓట్లను తొలగించండి.. ఈసీ కి వినతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!