గవాస్కర్ ఫైర్.. దేశవాళీ క్రికెట్‌పై షాకింగ్ కామెంట్స్!

కలం, స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం అనుసరిస్తున్న ఫార్మాట్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టు క్రికెట్‌లో విజయానికి కీలకమైన రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ అనుభవాన్ని దేశవాళీ స్థాయిలో బౌలర్లు కోల్పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌ను ఇందుకు ఉదాహరణగా గవాస్కర్ ప్రస్తావించారు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 270 పరుగులతో భారీ స్కోరు సాధించాడు. అనంతరం సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈస్ట్ జోన్‌కు భారీ ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ జోన్ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసింది. 100 ఓవర్లలో 388 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర అంగీకారంతో మ్యాచ్‌ను ముందుగానే ముగించారు.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యమే సరిపోతుందనే విధానం దేశవాళీ క్రికెట్‌లో సమస్యగా మారుతోందని గవాస్కర్ పేర్కొన్నారు. టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ప్రత్యర్థి 20 వికెట్లు తీయాల్సి ఉంటుందని, ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. దేశవాళీ క్రికెట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం తక్కువగా ఉంటే.. ఆ అనుభవం బౌలర్లకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇదే సమస్య అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోనూ కనిపిస్తోందని గవాస్కర్ సూచించారు.

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత్ చివరి రోజు నాలుగు వికెట్లు తీయలేకపోయిందని గుర్తుచేశారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి 429/9 వద్ద నిలవడంతో భారత్ విజయం దూరమైందని పేర్కొన్నారు.రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం అంత సులభం కాదని గవాస్కర్ అన్నారు. అందుకు శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం అవసరమని తెలిపారు. ఆ అనుభవం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనే లభించాల్సి ఉంటుందని, అందుకే దేశవాళీ మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లకు సమాన ప్రాధాన్యం ఉండేలా ఫార్మాట్‌లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>