కలం, డెస్క్ : సర్పంచులకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో ఇప్పటి వరకు చేసిన పనులకు గాను పెండింగ్ బిల్లులు చెల్లించుకోవచ్చని తెలిపింది. దీని కోసం జనవరి 5న రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని తెలిపింది. ఇప్పుడు కొత్తగా చేసే పనులను రిజిస్టర్ లో నమోదు చేసి వాటికి బిల్లులు చెల్లించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.


