కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే క్యాంపు రాజకీయాలపై (Camp Politics) ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైన ప్రతి అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది ఈసీ. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారిక ధృవీకరణ చేయాలని.. గెలుపొందిన అభ్యర్థి సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే ఈ ప్రాసెస్ జరగాలని ఈసీ సూచించింది. అయితే ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపొందిన తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్టు తెలుస్తోంది.


