epaper
Friday, January 23, 2026
spot_img
epaper

జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. జైషే ఉగ్రవాది హతం

కలం, వెబ్​డెస్క్​: జమ్మూకశ్మీర్ ​(Jammu Kashmir Encounter ) లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. నిఘావర్గాల సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సోదాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బిల్లావర్​ ఏరియాలోని పార్హెతర్​ ప్రాంతంలో దాగిన ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో అతను కాల్పులు జరిపాడు. వెంటనే భద్రతా దళాలు ఉగ్రవాది ఉంటున్న ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో టెర్రరిస్ట్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉగ్రవాదికి పాకిస్థాన్​కు చెందిన వ్యక్తిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాది కొన్నేళ్లుగా జైషే మహ్మద్​లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు చెప్పాయి. సమీపంలోని ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా దాగి ఉన్నారేమోనని సోదాలు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Encounter in Jammu Kashmir
Encounter in Jammu Kashmir

Read Also : జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. జైషే ఉగ్రవాది హతం

Follow Us On : Twitter

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>