కలం, వెబ్ డెస్క్: దేశం గర్వించదగ్గ సంగీత దర్శకురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత చరిత్ర సినిమా రాబోతుంది. రేపు సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. రష్మిక మందన్న సుబ్బులక్ష్మిలో పాత్రలో నటించింది.
‘జెర్సీ’ మూవీతో ఎంతో పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ చీఫ్ గెస్ట్గా హాజరై షూటింగ్ క్లాప్ కొట్టబోతున్నారు. అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీవాసు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వివరాలు వెల్లడించింది.
Also Read : పిల్లల డిజిటల్ భద్రతపై మెటా కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)

