కలం, నిర్మల్: ప్రజావాణి (Prajavani) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ (Kishore Kumar), వెంకటేశ్వర్లు (Venkateshwarlu) అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. ఇందులో డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read : గాంధీభవన్లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!
Follow Us On: Sharechat
ఆదిలాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

