కలం, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణను ఒకే ఏకీకృత పరిపాలన పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ స్టాండర్స్ అథారిటీ ఫర్ పుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అనే సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టీజీ సేఫ్కు కమిషనర్గా అవినాశ్ మహంతి (Avinash Mohanty) ని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అవినాశ్ మహంతి నేడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పదవీ బాధ్యలు స్వీకరించారు. ఆహార, ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలే లక్ష్యంగా టీజీ సేఫ్ పని చేస్తుంది.

