కరీంనగర్ లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతం!

కలం, కరీంనగర్​ బ్యూరో : బిసి స్టడీ సర్కిల్ కరీంనగర్ (Karimnagar) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి, వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 9:00నుంచి11:00 వరకు మొదటి షిఫ్ట్, పరీక్షలు నిర్వహించారు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 101 మంది హాజరైనట్టు తెలిపారు.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>