కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్తో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల కోసం 16 మంది జట్టు(England Squad)ను ప్రకటించింది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనుంది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్, బ్రెండన్ మెకల్లమ్ వైదొలగిన తర్వాత ఇంగ్లండ్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. జో రూట్ మళ్లీ టెస్టు కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. తాత్కాలిక హెడ్ కోచ్గా మార్కస్ ట్రెస్కోథిక్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఓలీ పోప్, డాన్ లారెన్స్, సామ్ కుక్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.
జోర్డాన్ కాక్స్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా జాకబ్ బెతెల్ సిరీస్కు దూరం కావడంతో నంబర్-3లో కాక్స్కు అవకాశం లభించనుంది. ఆగస్టు 19న హెడ్డింగ్లీలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత సహజ ఆల్రౌండర్ లేకపోవడంతో తుది జట్టు కూర్పు రూట్కు సవాల్గా మారింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ ప్రధాన స్పిన్ ఎంపికగా కొనసాగుతున్నాడు. డాన్ లారెన్స్ ఆఫ్ స్పిన్ కూడా జట్టుకు అదనపు బలం కానుంది.
ఇంగ్లండ్ స్క్వాడ్ (England Squad)
జో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మ్యాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
Also Read : రైతులకు తీపి కబురు.. ఖాతాల్లో రూ.994 కోట్లు జమ
Follow Us On : WhatsApp

