కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు పర్యాటకుల శోభ సంతరించుకుంది. భారీగా వరద నీరు వస్తుండటంతో.. గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సందర్శకుల తాకిడి పెరిగి వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పర్యాటకులు డ్యాం పైనే వాహనాలు నిలిపివేయడంతో అమరచింత, ధరూర్ పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

