కలం, వెబ్ డెస్క్: జనసేన (Janasena) పార్టీ ఎంపీలు శనివారం హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో జనసేన పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై పవన్ కల్యాణ్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
Read Also: రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్
Follow Us On: X(Twitter)

