కలం, స్పోర్ట్స్ : టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో యువ బ్యాటర్ తిలక్ వర్మ స్థానంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) సందేహాలు వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్తో త్వరలో జరగబోయే మూడు టీ20ల సిరీస్ నేపథ్యంలో ఆయన తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 అనుకున్న సమయానికే జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం స్పష్టం చేసింది. బ్రిక్స్ సమిట్ భద్రతా కారణాల వల్ల మ్యాచ్ను వాయిదా వేయాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదట కోరారు.
కానీ, పోలీసులతో చర్చించిన తర్వాత పూర్తి సహకారం లభించడంతో షెడ్యూల్ మారలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ సిరీస్ జట్టు ఎంపికపై మాట్లాడిన డివిలియర్స్, బ్యాటర్ల ఎంపికపై కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలతో పాటు ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ ఎక్కడ బ్యాటింగ్ చేస్తారనేది ప్రశ్నార్థకమని ఆయన అభిప్రాయపడ్డారు.
తిలక్ ఎంపిక లేదా పక్కనబెట్టడం జట్టు సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని డివిలియర్స్ అన్నారు. భారత్ది ఎంతో బలమైన జట్టు అని కొనియాడారు. అయితే అఫ్గానిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన జట్టు కావడంతో, ప్రతి ఆటగాడికి తమ పాత్రపై స్పష్టత ఉండటం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.

