కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని మంచిర్యాల (Mancherial)లో తీవ్ర విషాదం నెలకొంది. రైలు కింద పడి తండ్రి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు ఎండపల్లి మండలం గొడిసెలపేటకు చెందిన దొంత మల్లేశ్, నాగరాజుగా గుర్తించారు. రెండేళ్ల క్రితమే దొంత మల్లేశ్ భార్య క్యాన్సర్తో చనిపోయారు.

