కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. టెట్ ఫలితాలను పాఠశాలల విద్యాశాఖ విడుదల చేసింది. జులై 5 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. 12 రోజుల పాటు నిర్వహించిన పరీక్షకు 1.97 లక్షల మంది హాజరు అయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 90,862 మంది అర్హత సాధించారు. తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ/పాస్వర్డ్ వంటి వివరాలతో అధికారిక AP TET వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

