కలం, నిజామాబాద్ బ్యూరో : చెక్ పవర్ కేవలం తమ పరిధిలోనే ఉండాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు కలెక్టరేట్కు తరలివచ్చారు. ఉప సర్పంచ్లతో జాయింట్ పవర్ ఉంది. ఆ పద్ధతి తీసేసి కేవలం సర్పంచ్కే చెక్ పవర్ ఇవ్వాలని సర్పంచులు ధర్నా (Sarpanches Protest) నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాకు (Collector Bhavesh Mishra) వినతిపత్రం అందజేశారు. ఉప సర్పంచులతో జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ముందుకు సాగడం లేదని కుంటుపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

