హెలికాప్టర్ ప్రమాదం: ఏడుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : కెన్యాలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం (Kenya helicopter crash)లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు అమెరికన్లు కాగా, అమెరికాలోని ప్రముఖ స్పానిష్ మీడియా సంస్థ ‘టెలిముండో’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ 55 ఏళ్ల జోస్ అల్బెర్టో సువారెజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సీ-కొంటూగి, ఆయన భార్య స్టీఫానీ హోలీహన్, కెన్యాకు చెందిన పైలట్ కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు.

సాంబూరు కౌంటీలోని మైంట్ ఒలోలోక్వే పర్వత ప్రాంతానికి సమీపంలో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లగ్జరీ ట్రావెల్ సంస్థ అండ్ బియాండ్ (&Beyond) కు చెందిన పర్యాటకులను తీసుకెళ్తున్న లేడీ లోరి హెలికాప్టర్స్ సంస్థకు చెందిన ‘యూరోకాప్టర్’ హెలికాప్టర్ లోయిసాబా వైల్డ్‌లైఫ్ సంరక్షణ కేంద్రం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కొండ ప్రాంతంలో కూలిపోయింది.

ప్రమాదం జరిగిన స్థలం అత్యంత నిటారైన, దట్టమైన కొండ ప్రాంతం కావడం, కూలిపోయిన వెంటనే విమాన భాగాలు మంటల్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కెన్యా రెడ్ క్రాస్ అత్యవసర సహాయక బృందాలు కష్టమైన భూభాగంలో శ్రమించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ (KCAA) సమగ్ర విచారణ ప్రారంభించిందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>