కలం, వెబ్ డెస్క్ : గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి స్వర్ణం దక్కింది. మహిళల వెయిట్ లిఫ్టిండ్ లో స్టార్ లిఫ్టర్ మీరాబాయ్ చాను (Mirabai Chanu) ఈ ఘనత సాధించింది. 48 కిలోల విభాగంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి ఆమె చరిత్ర సృష్టించింది.
ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశానికి శుభారంభం లభించింది. మీరాబాయి చాను సాధించిన ఈ ఘనతపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

